న్యూఢిల్లీ : శాంసంగ్ (Samsung) తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5ను జులైలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ల మాస్ ప్రొడక్షన్ను జూన్లో ప్రారంభించేందుకు శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది. జులైలో కంపెనీ అన్ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లు జులైలో కస్టమర్ల ముందుకొస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్లను భారత్లోనూ ఆవిష్కరించడంతో కంపెనీ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లు సైతం దేశీ మార్కెట్లోకి రానున్నాయి. శాంసంగ్కు భారత్ కీలక మార్కెట్ కావడంతో భారత కస్టమర్లకు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గత ఏడాది మోడల్ తరహాలోనే శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల ధరలు భారంగానే ఉండే అవకాశం ఉంది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హార్డ్వేర్ ధరలు ఇప్పటికీ పిరంగా ఉన్నాయి. దీంతో శాంసంగ్ వీటిని తక్కువ ధరకు ఆఫర్ చేసే పరిస్ధితి లేదు.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 రూ. 89,999 పలకగా, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 రూ. 1,54,999 కాగా లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల ధరలూ ఇంచుమించుగా ఇదే స్ధాయిలో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక లీక్స్ ఆధారంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 7.6 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో ఫోల్డ్ చేసినప్పుడు కాంపాక్ట్ 6.2 ఇంచ్ స్క్రీన్ కనిపిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లో భాగంగా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
లేటెస్ట్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో 4400ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 విషయానికి వస్తే డిజైన్ మార్పులతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. న్యూ వెర్షన్లో భారీ డిస్ప్లే ఉంటుందని, కాంపాక్ట్ డిస్ప్లే స్ధానంలో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ తరహాలో ముందుభాగంలో భారీ డిస్ప్లేతో రానుందని టెక్ నిపుణుల అంచనా.
Read More
Find Your Phone | మీ సెల్ ఫోన్ పోయిందా ఇక ఇట్టే పట్టేయవచ్చు