ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. అందులో ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు నిత్యం యూజర్లకు అందుబాటులో ఉంటాయి. మెసేజ్ పంపడం మొదలు గ్రూప్ కాల్ వరకు పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్ అందువల్లే యూజర్ ఫ్రెండ్లీ యాప్గా మారింది వాట్సాప్. ఫలితంగా ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వాట్సాప్ సేవలను ప్రధానంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా వాట్సాప్ తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొన్ని ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రాగా, తాజాగా మరో ఫీచర్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది వాట్సాప్ యాజమాన్యం.
యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని భావాలు ఈ ఏమోజీల్లో తెలియ చేయొచ్చు. ఇప్పటి దాక వాట్సాప్ యాప్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్లు ఇస్తున్న ఏమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు.
ఇక నుంచి వాట్సాప్ తన యూజర్లకు సొంతంగా ఎమోజీలు అందుబాటులోకి తేనున్నది. టెలిగ్రామ్ యాప్లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది వాట్సాప్. ఈ యానిమేటెడ్ ఎమోజీలను ‘లొట్టి లైబ్రరీ’ సాయంతో తయారు చేస్తున్నారని వినికిడి. తాజాగా తీసుకొస్తున్న ఎమోజీలతో యూజర్లు సరికొత్త మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పొందుతారని వాట్సాప్ అంచనా వేస్తున్నది. ఈ వాట్సాప్ యానిమేటెడ్ ఎమోజీ.. బేటాడెస్క్ టాప్ వర్షన్ డెవలప్ మెంట్ దశలో ఉంది.