న్యూఢిల్లీ : శాంసంగ్ భారత్లో జనవరి ద్వితీయార్ధంలో రెండు గెలాక్సీ ఏ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనుంది. రెడ్మి నోట్ 12 సిరీస్ పేరుతో షియామి మిడ్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయడంతో శాంసంగ్ కూడా ఈ సెగ్మెంట్లో న్యూ 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఈ నెలలోనే గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ప్రవేశపెట్టనుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఏ14 5జీ ప్రారంభ ధర రూ 15,000 నుంచి మొదలవనుంది. గెలాక్సీ ఏ14 5జీ 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ+తో కూడిన ఎల్సీడీ డిస్ప్లేతో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఫోన్ వెనుకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు 2 ఎంపీ సెన్సర్లను కలిగిఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదని చెబుతున్నారు. 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 15డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఈ వారంలో భారత్లో లాంఛ్ అయిన రెడ్మి నోట్ 12 ఫోన్లకు శాంసంగ్ న్యూ స్మార్ట్ఫోన్లు దీటైన పోటీ ఇవ్వనున్నాయి. ఇక రెడ్మి నోట్ 12 బేస్ వేరియంట్ రూ 17,999 కాగా టాప్ వేరియంట్ రూ 19,999 పలుకుతోంది.