బెంగళూరు: తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని జోడీ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-రామ్కుమార్ రామనాథన్ జంట 6-3, 6-4తో అలెగ్జాండర్ ముల్లెర్-హ్యూగో (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. వరుస సెట్లలో విజృంభించిన భారత జోడీ 9 ఏస్లు సంధించగా.. ప్రత్యర్థి జోడీ రెండింటికే పరిమితమైంది. తెలుగు ఆటగాడు సాకేత్కు ఇది తొమ్మిదో ఏటీపీ టైటిల్ కాగా.. ఈ ఏడాది ఆరంభంలోనే రామ్కుమార్ మూడో టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం.