శుక్రవారం టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పరిసరాలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్కు వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగుతోంది. ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్, కన్ను, ఛాతి భాగంలో గాయాలు కాగా, శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం లేదని అపోలో వైద్యులు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్కి కాలర్ బొన్ సర్జరీ చేస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో సర్జరీ పూర్తి చేయనున్నారు. సెడిషన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది.. మరి కొద్ది సేపట్లో సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల కానుంది. హీరో రామ్చరణ్, నిర్మాత అల్లు అరవింద్ అపోలో ఆస్పత్రికి చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎప్పటికిప్పుడు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీస్తున్నారు.
నిర్లక్ష్యపు, ర్యాష్ డ్రైవింగ్ వలన సాయి తేజ్కి ప్రమాదం జరిగిందని, ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సాయితేజ్ స్పోర్ట్స్ బైక్ని స్వాధీనం చేసుకుని.. రాయదుర్గం పోలీసుస్టేషన్కు తరలించారు.