తాండూరు, జూన్ 4: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం తాండూరు నియోజకవర్గంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరులో నిర్వహించిన క్రీడాపోటీల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, డీఎస్పీ శేఖర్గౌడ్ పాల్గొని గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక చేయడం అభినందనీయమన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్లు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రత్యేక రాష్ట్రంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు చాల తక్కువయ్యాయని పేర్కొన్నారు. అందుకు పోలీసులు నిరంతర శ్రమనే కారణమన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో యువత, ప్రజలు ఏవిధంగా ఉండాలో పోలీస్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
బషీరాబాద్: రాష్ట్రంలో బెస్ట్ పోలీస్ వ్యవస్థ ఉందని, రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు మర్యాద కేంద్రాలుగా మారాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తాండూరు నియోజవర్గంలో బస్తీబస్తీకీ సీసీ కెమారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్తమ సాంకేతికను ఉపయోగిస్తూ భద్రత పరంగా దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్ర మంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ ప్రియాంక, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ పర్వత్పల్లి పాండురంగారెడ్డి, నాయకులు నర్సిరెడ్డి(రాజు), రాజ్కుమార్ కులకర్ణి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసు దేశానికే మాడల్గా నిలిచిందని తాండూరు రూరల్ సీఐ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని కోటబాసుపల్లి, కరణ్కోట గ్రామాల్లో సురక్షాదినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పోలీసు స్టేషన్లలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా షీటీం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో పోలీసులు అంటే ప్రజల్లో ఓ భయం ఉండేదని, తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసును తీసుకు వచ్చామని తెలిపారు. ఎస్సై మధుసూధన్రెడ్డి మాట్లాడుతూ షీటీం ఏర్పాటైన తర్వాత ఆడపిల్లల దండ్రులకు ఓ భరోసా కలిగిందన్నారు. ఆడపిల్లలు స్కూల్స్కు, కళాశాల లకు భయంలేకుండా వెళుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విమ ల, వైస్ ఎంపీపీ స్వరూప, సర్పంచ్లు నాగార్జున, వీణ, ఉప సర్పంచ్ హేమంత్ కు మార్, బీఆర్ఎస్ నాయకులు వీరేందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, మొగులప్ప ముదిరాజ్, సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సుధాకర్గౌడ్ తదితరులు ఉన్నారు.
బొంరాస్పేట: తుంకిమెట్ల గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షలో పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీ సింగ్ విధానం, పోలీసు శాఖ అందిస్తున్న షీటీమ్, బ్లూకోట్స్ సేవలు తదితర వాటి గురించి ఎస్సై శంకర్ ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత విషయంలో వాహన దారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు శాంతి భద్రతలకు విఘాతం కలింగే సంఘటనలు జరిగితే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై శంకర్ కోరారు. కార్యక్రమంలో ఏఎస్సై కృష్ణయ్య, పోలీసు సిబ్బంది, బీఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షుడు మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.
దౌల్తాబాద్: దేవర్ఫస్లవాద్ , బాలంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్ఐ రమేశ్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు – రాష్ట్ర ఏర్పాటు అనంతరం పోలీస్ శాఖలో సీఎం కేసీఆర్ ఎలాంటి మార్పులు తీసుకవచ్చారనే దానిపై ప్రజలకు వివరించారు.ముందుగా షీటీమ్సు, 100డైల్, ఫ్రెండ్లీ పోలీస్ తదితర మార్పులు తీసుకవచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొడంగల్: స్థానిక అంబేద్కర్ కూడలిలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాహన చట్టం, పోలీసుల పనితీరు, ప్రజల సహకారంపై ఎస్ఐ రవిగౌడ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ 1930 హెల్ప్లైన్ సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాల గురించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 181 మహిళలపై గృహ హిస, లైంగిక వేధింపులు. 100 డయల్ అత్యవసర పరిస్థితుల్లో , సత్వర సహాయం పొందేందుకు, 1098 హెల్ప్లైన్ పిల్లలపై జరిగే నేరాలు, హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ బాలకిషన్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దోమ: స్నేహ పూర్వక విధానంతో పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తు న్నారని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. దోమ మం డల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్సై విశ్వజన్ అధ్యక్షతన నిర్వహించిన కార్య క్రమానికి స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రైతు బంధు కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ యాద య్యగౌడ్, ఆశావర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,గ్రామ యువకులు పాల్గొన్నారు.
కోట్పల్లి: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాలించాలని కోట్పల్లి ఎస్ఐ సత్యనారాయణ రాజు కోరారు. ఆదివారం బార్వాద్, కోట్పల్లి గ్రామాల్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలను నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్లను ధరించాలని, వాహనాల పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. తాగి వాహనాలను నడుపవద్దని సూచించారు.
పరిగి టౌన్: శాంతిభధ్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని ఎస్సై విఠల్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసుల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీసులపట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని. కమ్యూనికేషన్ విభాగం అభివృద్ది చెందిందని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేసిన వెంబడే క్షణాల్లో తమ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజేందర్, నాయకులు అశోక్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: పట్లూర్ రైతు వేదికలో పోలీస్ సురక్ష దినోత్సవాన్ని ఎస్సై అరుణ్కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల గురించి, పోలీస్ విధి నిర్వహణ గురించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పం చ్ ఇందిరా అశోక్, ఉప సర్పంచ్ మొహిజ్, నాయకులు ఖాజా, షఫీ, అశోక్, వికాస్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాలించాలని ధారూరు సీఐ అప్పయ్య సూచించారు.ఆదివారం నాగసముందర్, ధారూరు గ్రామాల్లో వాహన దారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. సీసీ కేమె రాలు ఏర్పాటుకు కోసం గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందించారని, త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పం చ్, ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు వాహనదారులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.