ఘట్కేసర్, జనవరి 4: సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రత్యేకంగా అమ లు చేస్తున్న రైతు బంధు పథకానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లో పడుతున్నందున గ్రామ గ్రామాన రై తు బంధు సంబురాలు ఘనంగా ని ర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మం త్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధు లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతుల ను ఉద్దేశించి ఘట్కేసర్లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ ఏనుగు సు దర్శన్ రెడ్డి అధ్యక్షతన మండల రైతు లు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో మంగళవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ర్టాలలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కోటిన్నర ఎ కరాలకు రూ.7,500 కోట్లను రైతు బంధు కింద కేటాయించి రైతుల ఖా తాల్లో జమ చేయడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. సమావే శం అనంతరం సీఎం చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షీరాభిషేం చేశారు. కార్యక్రమంలో మంద సంజీవ రెడ్డి, దర్గ దయాకర్రెడ్డి, శ్రీ నివాస్ గౌడ్, కె.అంజిరెడ్డి, ఎన్.రమే ష్, ప్రవీణ్రెడ్డి, కొండల్రెడ్డి, భిక్షపతి గౌడ్, మచ్చేందర్ రెడ్డి పాల్గొన్నారు.