వాషింగ్టన్ : అగ్రరాజ్యాలు చేతులు కలుపనున్నాయి. గత కొన్నేండ్లుగా ఇరుదేశాల మధ్య ఉన్న అంతరాలను తొలగించుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా సంయుక్త రాష్ట్రాలు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ఘర్షణ 45 ఏండ్లపాటు కొనసాగి 1990 లో సోవియట్ రష్యా పతనంతో అంతమైంది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తిరిగి ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. దీనికి అమెరికానే చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య పరస్పర ఉద్రిక్తతను అంతం చేయాడానికి ఇరుదేశాలు చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. రెండు పెద్ద అగ్రశక్తుల నాయకుల ప్రతిపాదిత సమావేశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని వైట్ హౌస్ అందించింది. “రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైన పక్షంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న మనోభావాలను అంతం చేయడం, సానుకూల సంబంధాలను నెరపడం సాధ్యమవుతుంది” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడినట్లు వైట్హైస్ ఒక ప్రకటనలో తెలిపింది. శ్వేతసౌధంలో రోజువారీ మీడియా సమావేశంలో శుక్రవారం సాయంత్రం కార్యదర్శి జేన్ సాకి మాట్లాడుతూ, ప్రస్తుతానికి సమావేశం తేదీని నిర్ణయించలేదు. ఈ సమావేశానికి అధ్యక్షుడు బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆహ్వానించారు. ఈ సమావేశంతో ఇరు దేశాల మధ్య ఉన్న పొరపొచ్చాలు తొలిగి సంబంధాల మెరుగుపడుతుందని వారు నమ్ముతున్నారు.
ఈ సమావేశానికి సంబంధించి సిబ్బంది స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సమావేశం ఎజెండా సెట్ చేయబడుతున్నది. అంతేకాకుండా దేశాన్ని రక్షించడంలో బైడెన్ నిబద్ధతను తెలియజేస్తూ సాకి ఒక ప్రకటనను కూడా పునరుద్ఘాటించారు. అమెరికా సార్వభౌమత్వానికి హాని కలిగించే రష్యా తీసుకున్న చర్యలు దాని జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తాయని ఆయన అన్నారు.
గత నెల ప్రారంభంలో అధ్యక్షుడు బైడెన్.. పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, క్రిమియాపై అకస్మాత్తుగా రష్యా సైనిక కార్యకలాపాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సమావేశానికి చాలా కారణాలున్నాయని భావిస్తున్నారు. 32 రష్యా సంస్థలతోపాటు వ్యక్తులను అమెరికా నిషేధించడం, 2020 ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేయడం, సాఫ్ట్వేర్ హ్యాకింగ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ఆరోపణలను రష్యా ఖండిస్తూనే ఉన్నది.
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
ఆగస్టు నాటికి బ్రిటన్లో కరోనా అంతం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..