న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసిను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిశారు. ఢిల్లీలోని కస్తూర్బా గాంధీమార్గ్ మసీదులో ఆ భేటీ జరిగింది. సీనియర్ నేతలతో కలిసి భగవత్ ఇవాళ ఇమామ్ అహ్మద్తో సంభాషణలు జరిపారు. ఆర్ఎస్ఎస్ చర్చా విధానంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు ఆ సంస్థ పబ్లిసిటీ ఇంచార్జీ సునిల్ అంబేద్కర్ తెలిపారు. సుమారు గంట పాటు ఇద్దర ముచ్చటించుకున్నారు. భగవత్తో కలిసి వెళ్లిన వారిలో కృష్ణ గోపాల్, రామ్లాల్, ఇంద్రేశ్ కుమార్లు ఉన్నారు. దేశంలో మత సామరస్య స్థాపన కోసం ఇటీవల ముస్లిం నేతలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ కలుస్తున్నారు. సంవాద్ ప్రక్రియలో భాగంగా అన్ని రకాల ప్రజలను కలుస్తున్నామని సునిల్ అంబేద్కర్ చెప్పారు.