ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 22: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్ రూ.3 లక్షలు విరాళాన్ని సర్పంచ్ పార్శపు శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో గ్రామానికి వచ్చినప్పుడు పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నట్టు గుర్తించానని చెప్పారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా తన తండ్రి బెజ్జంకి సురేందర్రావు స్మారకార్థం సోదరులు హన్మంత్రావు, హరీశ్రావుతో కలిసి రూ.3 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. భవన నిర్మాణం కోసం మంగళవారం స్థలాన్ని పరిశీలించారు.