ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మూడ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు అతను తన భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ చేస్తున్నాడు. ఓ రిసార్ట్లో భార్య రితికతో దిగిన ఫోటోను రోహిత్ షేర్ చేశాడు. తన ఇన్స్టాలో ఆ ఫోటోను పోస్టు చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరికొన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలన్న ఉద్దేశాన్ని రోహిత్ తన పోస్టులో వెల్లడించాడు.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన రోహిత్ ఏమాత్రం రాణించలేదు. 14 ఇన్నింగ్స్లో అతను 19.14 సగటుతో 268 రన్స్ చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్కోర్ 48 మాత్రమే. దక్షిణాఫ్రికాతో జరిగే అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రోహిత్ దూరంగా ఉండనున్నారు. కోహ్లీ, బుమ్రాలతో పాటు అతనికి రెస్ట్ ఇచ్చాడు. ఇక జూన్ చివరలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు కోసం అతను మళ్లీ ఇండియా జట్టుతో కలుస్తాడు.