ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్టీం, పోలీసులు
హయత్నగర్, జూలై 28: అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలోని శివాలయం కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నమయ్యారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు కథనం ప్రకా రం.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్ మురళీధర్రెడ్డికి చెందిన ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు మాస్కు ధరించి ప్రవేశించి మెయిన్ డోర్ తాళాలు, కప్బోర్డు తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు.బాధిత కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లో నివాసం ఉంటుండడంతో పెద్దఅంబర్పేటలోని ఇంటి ని ఆఫీసుకు కేటాయించారు.
గురువారం ఉదయం మురళీధర్రెడ్డి దంపతులు పెద్దఅంబర్పేటలోని ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి కనిపించాయి.ఇంట్లోకి వెళ్లి చూడ గా వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. విషయం తెలుసుకున్న క్లూస్టీం, క్రైమ్ విభాగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా రికార్డుల్లో ఒక వ్యక్తి మాస్కు ధరించి చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనా స్థలాన్ని హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్, డీఎస్ఐ శోభన్బాబు, క్రైమ్ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.