యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట ( Yadagirigutta ) లో స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. యాదగిరిపల్లి వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.
గాయపడినవారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.