న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.108.64కు పెరుగగా.. డీజిల్ ధర రూ.97.37కి చేరింది. అలాగే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.114.47కు ఎగబాకగా.. డీజిల్ ధర రూ.105.49కి పెరిగింది.