హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒకరినొకరు పల్లె త్తు మాట అనుకోరు. కేంద్రంలోని బీజేపీ సర్కారును కూడా రేవంత్రెడ్డి పల్లెత్తు మాట అనరు. కానీ, వీరిద్దరూ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేంద్ర నిరంకుశ విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రైతుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి ప్రతిసారీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అస లు ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్న కేంద్రంపై మాత్రం విమర్శలు చేయరు.
అజ్ఞానంతో అడ్డగోలు మాటలు
పది వేల కోట్లు ఇస్తే కాంగ్రెస్ మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తుందంటూ రేవంత్రెడ్డి తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. రాష్ట్రం లో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం రానున్నది. పంట కొనుగోలుకు రూ.14 వేల కోట్లకు పైగా అవసరమని అంచనా. రైతుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ధాన్యం కొనుగోలు చేయడం సమస్యే కాదు. ఆ ధాన్యాన్ని నిల్వ చేయడం, తిరిగి ఎవరికైనా విక్రయించడమే అసలు సమస్య. నిల్వల నిర్వహణకు గోదాములు, ఎగుమతి సౌకర్యాలు రాష్ట్ర ప్ర భుత్వానికి లేవు. అందుకే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నది. కానీ ఈ సమస్యలేవీ పట్టని రేవంత్రెడ్డి, ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలకు పోతూ రైతులను త ప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంపై కాదు.. కేంద్రంపై యుద్ధం చేయండి
రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై యు ద్ధం చేస్తామని ప్రకటించారు. ఓ ఎంపీగా, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డికి అసలు ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్య త ఎవరిదో తెలుసా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ సర్కారును నిలదీయాలని సూచిస్తున్నారు. రేవంత్ ఏ నాడైనా ఎంపీగా పార్లమెంట్లో రాష్ట్ర రైతుల సమస్యను ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడుతుంటే రేవంత్రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీ లు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుండిపోయారు.