రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా రాయపోల్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
ఏఈ శ్రీనివాస్ను కలిసిన వారిలో మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్, ఉపసర్పంచ్ సంతోష్,
మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్తోపాటు కనక చంద్రం, నరసింహారెడ్డి, కనకరాజు, అశోక్, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. గ్రామంలో ముఖ్యంగా మల్లన్న గుడి పరిసర ప్రాంతంలో కొత్త విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కొన్నిచోట్ల వైర్లు సాగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని వారు ఏఈ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఏఈని కోరారు. దీనిపై స్పందించిన ఏఈ శ్రీనివాస్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.