RBI | వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రేపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్బీఐ గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచింది. అలా ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు వచ్చింది. ఆ పెంపు వివరాలు ఇవే..
2022 మేలో 0.40 శాతం
2022 జూన్లో 0.50 శాతం
2022 ఆగస్టులో 0.50 శాతం
2022 సెప్టెంబర్లో 0.50 శాతం
2022 డిసెంబర్లో 0.35 శాతం
2023 ఫిబ్రవరిలో 0.25 శాతం