పరిగి, మార్చి 31: ఉద్యోగార్థులు కోరిన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు గ్రం థాలయ సంస్థ చర్యలు తీసుకుంటున్నదని విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. పోటీ పరీక్షల కోసం రాష్ట్రంలోని 110 గ్రంథాలయాల్లో పుస్తకాలు సిద్ధంగా ఉంచుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. గురువా రం వికారాబాద్లోని జిల్లా గ్రంథాలయంలో ‘బుక్స్ ఆన్ డిమాండ్’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలలో పుస్తకాలు చదివి అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, కాలె యాద య్య, పైలెట్ రోహిత్రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.