వాషింగ్టన్, అక్టోబర్ 4: అమెరికా దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో చరిత్రలో ఎన్నడూ లేని పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్గా వ్యవహరిస్తున్న విపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెకార్టీని పదవీచ్యుతిడిని చేశారు.
ఇటీవల దేశంలో ఏర్పడిన షట్డౌన్ సంక్షోభంలో ఆయన అధికార డెమోక్రాట్లకు బాహాటంగానే మద్దతు పలకడం రిపబ్లికన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో మాట్ గీట్జ్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం 216-210తో నెగ్గడంతో మెగార్టీ స్పీకర్ పదవి నుంచి దిగిపోక తప్పలేదు. తొలుత దీనికి నిరాకరించిన ఏడుగురు రిపబ్లికన్ సభ్యులు చివరకు మద్దతుగా నిలవడంతో తీర్మానం నెగ్గింది. సభ కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉందని సీఎన్ఎన్ తెలిపింది.