అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ తన సొంత నిధుల నుంచి 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గర్భాలయం, ధ్వజ స్తంభం గాలి గోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహ ద్వారం
నిర్మాణాలపై చర్చించారు.
అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ తన సొంత నిధుల నుంచి 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. వాటి
పురోగతిపై శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గర్భాలయం, ధ్వజ స్తంభం గాలి గోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహ ద్వారం
నిర్మాణాలపై చర్చించారు.
అర్వపల్లి, మార్చి 11 : అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధి పనులపై శుక్రవారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.1.20కోట్లతో చేపట్టిన గర్భాలయ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు, గాలి గోపురం, ఆలయ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహద్వారం నిర్మాణాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, స్తపతి ఆనందవేలు, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, అర్చకులు రాంబాబు అయ్యంగార్ పాల్గొన్నారు.