అమరావతి,జూన్18: ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను అక్కడి ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే తూర్పుగోదావరి జిల్లా లో కరోనా ఇంకా తగ్గుముఖం పెట్టకపోవడంతో అక్కడ 2 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నది. జూన్ 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని ఏపీ సర్కారు తెలిపింది. ఈ సడలింపు జూన్ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది. సాయంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉండనుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.