రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూడటం కన్నా.. టికెట్ కౌంటర్ దగ్గర క్యూలైన్లో నిరీక్షించడమే సహనానికి పరీక్ష పెడుతుంది. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అన్రిజర్వ్ టికెట్ల కోసం కౌంటర్ దగ్గర వేచి చూడకుండా మీ ఫోన్లోనే ‘రైల్వన్’ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, కౌంటర్ ధర కంటే 3 శాతం డిస్కౌంట్తో ప్రయాణించవచ్చు.
ఈ సరికొత్త పథకాన్ని జనవరి 14 నుంచి జూలై 14 వరకు నార్తర్న్ రైల్వే అమలు చేస్తున్నది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని జోన్లలోనూ సేవలు అందుబాటులోకి తేనున్నది. ప్లే స్టోర్ నుంచి రైల్వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. టికెట్ బుక్ చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ కార్డ్స్ ఎంచుకుంటే 3 శాతం డిస్కౌంట్ ఆటోమేటిక్గా మీ ఖాతాలో పడిపోతుంది. కౌంటర్ దగ్గర వేచి చూడకుండానే టికెట్ పొందొచ్చు. 3 శాతం డిస్కౌంట్ చిన్న మొత్తంగా అనిపించినా.. రెగ్యులర్గా రైలు ప్రయాణం చేసేవారికి ఇది మంచి ప్రయోజనమే అందిస్తుంది.