పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29: రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ చోట తల, మరో చోట మొండెం లభించింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లిమల తండాకు చెందిన టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కడావత్ రాజు(32) కన్పించడం లేదని ఈ నెల 24న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25న ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ క్రమంలో ఇంద్రకరణ్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు రాజును దారుణంగా హత్యచేసి తల, మొండెం వేర్వేరు ప్రాంతా ల్లో పడేసినట్టు పోలీసులు గుర్తిం చారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి విచారించారు. వారి సమచారంతో రాయికోడ్ మండలం కుస్నూర్ వాగు, న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మంజీర నదిలో తల, మొండెంను స్వాధీనం చేసు కొన్నారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.