శేరిలింగంపల్లి, నవంబర్ 21: హైదరాబాద్కు చెందిన రెసోనాన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని బాలయోగి క్రీడా స్టేడియంలో నిర్వహించిన “రెసోఫెస్”్ట ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి జుడీషిల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సభ్యురాలు జస్టిస్ టి.రజని, ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పుస్తకాలు ఎక్కువగా చదవండి…టీవీలు తక్కువగా చూడండి… వీలైనంత వరకు ఎక్కువ సంతోషంగా గడపండి. అపుడే, విజయాలు మీ సొంతమవుతాయని త్రివిక్రమ్ శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ రెసోనాన్స్ హైదరాబాద్ శాఖ డైరక్టర్ పూర్ణ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.