ఇబ్రహీంపట్నం, జూన్ 27: నియోజకవర్గంలోని కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. మొదటినుంచి గ్రూపు తగాదాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల వర్గపోరు మరింత తీవ్రమైంది. ఇటీవల టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలు కూడా ఎవరికి వారుగా పోటాపోటీగా చేపట్టారు. దీంతో పార్టీలోని నాయకుల్లో తీవ్ర అయోమయం నెలకొన్నది. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గ్రూపు తగాదాలతో విసిగిపోయి టీఆర్ఎస్లో చేరారు. ఉన్న కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలు కూడా నేతల మధ్య నెలకొన్న వర్గపోరుకు అయోమయానికి గురవుతు న్నారు. సోమవారం ‘అగ్నిపథ్’ కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర అధిష్ఠానం అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండుచోట్ల పోటాపోటీగా దీక్షలను నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి వర్గీయులు సత్యాగ్రహ దీక్షను నిర్వహించగా, ఆయన వ్యతిరేక వర్గమైన కిసాన్సెల్ రాష్ట్ర నాయకుడు కోదండరెడ్డి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు శేఖర్గౌడ్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నిరంజన్రె డ్డి, పీసీసీ కార్యదర్శి రాంరెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు తుర్కయాంజాల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. పోటాపోటీగా నిర్వహిం చడంతో కిందిస్థాయి నాయకులు ఎవరి దీక్షకు వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. మరికొంతమం ది ఎక్కడికెళ్లకుండా ముఖం చాటేశారు. ఇటీవల మల్రెడ్డి రంగారెడ్డి నిర్వహించిన ‘రచ్చబండ’కు కూడా ఆయ న వ్యతిరేక వర్గానికి చెందిన నాయకులు హాజరుకాలేదు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా మారింది.