షాద్నగర్టౌన్, మే 16: పట్టణ ప్రగతితో షాద్నగర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి సాధించ నుందని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో కలిసి సాధారణ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలోని వార్డులు మరింత సుందరంగా మారనున్నాయన్నారు. అదే విధంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని 28వ వార్డులో చేపట్టే వివిధ పనుల నిమిత్తం రూ. 1. 45 కోట్లు, పట్టణ ప్రగతికి సంబంధించి రూ. 45 లక్షలను కేటాయించేందుకుగాను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇటీవలే షాద్నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు రావడంతో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్కుమార్రెడ్డిని కౌన్సిలర్లు సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, సర్వర్పాషా, రాజేశ్వర్, గౌస్, కొందూటి మహేశ్వరి, విశాల, కౌసల్య, శారద, ప్రేమలత, మాధురి, మానస, శాంతమ్మ, చంద్రకళ, శ్రావణి, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.