ఆమనగల్లు, మార్చి 30 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు. మంగళవారం పట్టణంలో ఎస్ఐ ధర్మేశ్ ఆధ్వర్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించి రక్షణ చర్యలు వివరించారు. అనంతరం వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారస్తులు, వ్యక్తులపై తీసుకొనే చర్యలు, జరిమానాలను తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై రూ.వెయ్యి జరిమానా, రెండేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 లోని సెక్షన్ 51 నుంచి 60 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
మాస్క్ ధరించి బయటకు రావాలి..
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 30 : కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్ఐ వీరభద్రం అన్నారు. రాచకొండ సీపీ మహేశ్భగవత్ ఆదేశాలతో అబ్దుల్లాపూర్మెట్ జాతీయ రహదారిపై మాస్క్ లేకుండా వెళ్తున్న వాహనదారులను ఆపి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరభద్రం మాట్లాడుతూ ప్రజలు మాస్క్ ధరించి బయటకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పీసీ శివశంకర్, మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రచారం..
ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 30 : రోడ్లపైకి వచ్చేప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇబ్రహీంపట్నం పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సైలు నాగేంద్ర, రామస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు పరిసరాల్లో అవగాహన కల్పించారు.
వేడుకలు తక్కువ మందితో చేసుకోవాలి
యాచారం, మార్చి 30 : కొవిడ్ నిర్మూలనకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే జరిమానా విధిస్తామన్నారు. పండుగలు, ఫంక్షన్లు తక్కువ మందితో చేసుకోవాలన్నారు. శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలన్నారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతిని నిబంధనల మేరకు నిర్వహించుకోవాలన్నారు. జీవో 69ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ కూడా చదవండి..
జంతు ప్రేమికుల కోసం… ‘పా వాక్’
జైలుకు వెళ్లొచ్చినా మారని బుద్ధి