క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రామ, మండల, మున్సిపాలిటీ, జిల్లా కమిటీల నియామకం చేపడుతున్నది. ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడినవారికి సముచితస్థానం కల్పిస్తున్నారు. రెండు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కమిటీల నియామకం జోరుగా సాగుతున్నది. పార్టీ గ్రామ, వార్డుల కమిటీల ఎన్నిక దాదాపు పూర్తికాగా.. మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక ప్రారంభమైంది. ఇంకా కమిటీల ఎన్నిక పూర్తికాని గ్రామాల్లో వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 30లోపు అన్నిస్థాయిల్లో కమిటీల నియామకం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం జిల్లా కార్యవర్గం ఎన్నికను చేపట్టనున్నది. కాగా, రంగారెడ్డి జిల్లాలో గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకం పూర్తికాగా.. వికారాబాద్ జిల్లాలో 98 శాతం పూర్తయింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక దాదాపు పూర్తి కావొచ్చింది. ఈనెల15లోగా ఇంకా పూర్తికాని గ్రామ, వార్డు కమిటీలను వెంటనే పూర్తి చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా పార్టీ జిల్లా యంత్రాం గం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రజాప్రతినిధులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ కోసం కష్టపడే వారికి కమిటీల్లో చోటు కల్పిస్తూ ముందుకెళ్తున్నారు.రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో, వార్డు కమిటీలు పూర్తికాగా, వికారాబాద్ జిల్లాలోని తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పూర్తికా గా, వికారాబాద్ నియోజకవర్గంలో 98 శాతం కమిటీల ఏర్పాటు పూర్తి కాగా, రేపటిలోగా మిగతా గ్రామాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ, మండల, మున్సిపాలిటీ, జిల్లా కమిటీలను నియమించి పార్టీని బలోపేతం చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.ఈనెల 30 వరకు అన్ని స్థాయిల్లోని కమిటీల ఎ న్నిక పూర్తి కానుంది. దాదాపు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామ, వార్డు కమిటీలు పూర్తి కావడంతో క్షేత్రస్థాయి క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది.
20 వరకు మండల, మున్సిపాలిటీ కమిటీలు
టీఆర్ఎస్ పార్టీ గ్రామ, వార్డు కమిటీలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దాదాపు పూర్తికాగా సోమవారం నుంచి మండల, మున్సిపాలిటీల కమిటీల ఎన్నిక ప్రారంభమైంది. ఈనెల 20 వరకు మండల, మున్సిపా లిటీల్లో పట్టణ కమిటీలను, వాటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మండల, పట్టణ కమిటీల్లో 22నుంచి 25మందికి ప్రాతినిథ్యం కల్పించే లా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీని గ్రామగ్రా మాన బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్ హైకమాండ్ గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది.ప్రస్తుతం పార్టీ బలమైన శక్తిగా తయారైన నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి ఏదో ఒక పదవులు ఆశించి పార్టీలో చేరారు కాబట్టి గులాబీ క్యాడర్ జోష్ నింపేలా జిల్లా కార్యవర్గంతోపాటు మండల, మున్సిపల్, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో ఇప్పటికే నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీ కొత్త కమిటీలతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా మంది ఆశావహులకు పార్టీ పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు కమిటీల్లో చోటు దక్కిన గులాబీ శ్రేణులు నయా జోష్తో పల్లెపల్లెన పార్టీ జెండాను ఎగురవేస్తున్నారు. మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక అనంతరం పార్టీ అనుబంధ సంఘాలైన విద్యార్థి, కార్మిక, మహిళా, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో 9మంది సభ్యులు ఉండనున్నా రు. మరోవైపు అన్ని కమిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలు 51శాతానికిపైనే ఉండాలని, లేనట్లయితే సంబంధిత కమిటీలు చెల్లుబాటు కాదని ఇప్పటికే పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ కోసం కష్టపడే, ఉత్సాహంగా పనిచేస్తున్న వారికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ పదవులను కట్టబెట్టేందుకు పార్టీ యం త్రాంగం నిర్ణయించింది.
జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి…
అధికార పార్టీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే దానిపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆసక్తి నెలకొంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎవరిని అధ్యక్షులుగా ఎన్నుకుంటారనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు రెండు జిల్లాల్లోనూ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన పార్టీ అధిష్టానం సమర్థులకే జిల్లా అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టే యోచనలో ఉన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యవర్గాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించి ప్రకటించనున్నారు. అంతేకాకుండా నియామకంలోనూ సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని జిల్లా అధ్యక్షుడిని నియమించనున్నారు.