షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ ప్ర శాం తిరెడ్డితో కలిసి షాబాద్ మం డల పరిధిలోని సోలీపేట్, మద్దూర్ గ్రా మాల్లో పర్యటించారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడు తూ… ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పింఛన్ ఇచ్చే వ్యక్తి రూ.16 పట్టుకుని రూ. 2వేలు మా త్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ ఇచ్చే వ్యక్తికి ఫోన్ చేసి పూర్తి డబ్బులు అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిధులు మంజూరు చేస్తాం..
గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రెండేండ్లుగా కరోనాతో నిధులు మంజూరు కాలేదన్నారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సోలీపేట్ నుంచి హైతాబాద్ వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లోని సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న శుభోదయం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు రమ్య, నరేందర్రెడ్డి, మల్లేశ్, ఎంపీటీసీ మామిడి లత, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, డైరెక్టర్ యాదయ్య, టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, బీసీ సెల్ మండలాధ్యక్షుడు సుధాకర్గౌడ్, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్రెడ్డి, ఏఈలు శ్రీదివ్య, నరేందర్, ఏపీవో వీరాసింగ్, ఏపీఎం నర్సింహులు, పార్టీ నాయకులు కావలి గోపాల్ పాల్గొన్నారు.