అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్కు మాట తప్పటం.. మడమ తిప్పటం అలవాటుగా మారిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్కు 31 మంది ఎంపీలున్నారని అయినా మోదీ వద్ద ఎందుకు చేతు లు ముడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆయన అన్నారు. విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని ఆరోపించారు. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తుంటే మైనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు. రెవెన్యూ లోటు భర్తీ లేదు, విశాఖ రైల్వే జోన్ లేదని అంటూ మండిపడ్డారు.