వనపర్తి : బాలికల విద్య కోసం కృషి చేసిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వెంకట రామిరెడ్డి 152 వ జయంతి సందర్భంగా కొత్తకోట మండలం రాణిపేట స్టేజీ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థుల కోసం హాస్టల్ నెలకొల్పి విద్యాభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. మహిళా సాధికారత, అభ్యున్నతికి బీజం వేసాడని ఆయన సేవలను కొనియాడారు.
నిజాం పరిపాలనలో ఉన్నత పోలీసు అధికారిగా పనిచేసి నిజాం ప్రభువును మెప్పు పొంది పేదలకు సహాయసహకారాలు అందించిన మహానుభావుడు వెంకట్ రామ్ రెడ్డి అన్నారు.
తాను కూడా రెడ్డి హాస్టల్లో చదువుకున్నాని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ తదితరులు ఉన్నారు.