స్టేషన్ఘన్పూర్, జనవరి 14: రైతుల కోసం పోరాడుతున్న సీఎం కేసీఆర్పై మాట్లాడటం కాదని, ముట్టుకొని చూస్తే తెలుస్తుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కేసీఆర్ వెంట 60 లక్షల మంది సైన్యం, రైతులు, అభిమానులు ఉన్నారని, కేసీఆర్తో పెట్టుకుంటే మసి అయిపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన రైతు బంధు సంబురాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బీజేపీ నేత బండి సంజయ్కి రైతులపై ప్రేమ ఉంటే ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రధాని నరేంద్రమోదీకి లెటర్ రాయాలని డిమాం డ్ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలు సైతం కాపీ కొడుతున్నారని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ సైతం కాపీ కొట్టి కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగున్నాయం టూ కొందరు కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే కావాలనే కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే సంవత్సరానికి లక్షల్లో కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.