నాగర్కర్నూల్, డిసెంబర్ 1 : రైతన్న కష్టాలు, రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు ను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి తెలిపా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని రామకృష్ట థియేటర్లో మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్యతో కలిసి రైతన్న సినిమాను తిలకించారు. సినిమా విశ్రాంతి సమయంలో థియేటర్కు వ చ్చిన సినీనటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి ఎ మ్మెల్యే మర్రి విలేకరులతో మాట్లాడారు. కవులు, కళాకారులు సమాజం కోసం పని చేస్తున్నారని, అలాంటివారిలో నారాయణమూర్తి ఒకరని అన్నారు. సమస్యలను తెలిపేలా సినిమా ప్రారంభంలోనే పాట చిత్రీకరించినట్లు చెప్పారు. కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీ సుకోవడంలో నారాయణమూర్తి పాత్ర ఉందన్నారు. దేశంలోని ప్రతి రైతూ ఈ సినిమా చూడాలన్నారు.
ప్రజల గుండెల్లో ఉన్నాను.. : నారాయణమూర్తి
తాను డబ్బున్న హీరోను కాదని.. ప్రజల గుండెల్లో దాగి ఉన్న వాడినని సినీనటుడు ఆర్.నారాయణమూ ర్తి పేర్కొన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరారు. సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాలు ఇచ్చిన బలమే రైతన్న సినిమా అని అ న్నారు. మూడు చట్టాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ధర్నా చేసి రైతుల పక్షాన నిలబడ్డారని, ఈ ఉద్య మం రైతుల్లోకి వెళ్తే ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందోన న్న భయంతో కేంద్రం నల్లచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. క్షమించాలని బహిరంగంగా ప్రధాని కోరారన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో మృత్యువాత పడిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆదుకోవాలని కోరారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
జడ్చర్ల, డిసెంబర్ 1 : గిట్టుబాటు ధరలు కల్పించాలనే నేపథ్యంలో రైతన్న సినిమా చిత్రీకరించడం అభినందనీయమని ఎమ్మె ల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. రైతన్న సినిమాను బుధవారం జడ్చర్లలోని వెంకటరమ ణ థియేటర్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్న ఒక మంచి సందేశాత్మక చిత్రం అని అన్నారు. రైతుల కష్టాలు, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై చూ పించారన్నారు. రైతులందరూ సినిమా చూ డాలని కోరారు. ఆర్.నారాయణమూర్తి మా ట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా రైతులు ఎలా ఉద్యమం చేశారో చూయించామన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమి చైర్మన్ బాద్మిశివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సర్పంచులు, మాజీ సర్పంచులు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ తదితరులు ఉన్నారు.
మోసం చేసే రోజులు పోయాయి
మహబూబ్నగర్, డిసెంబర్ 1 : రైతులను మోసం చేసి కా లం గడుపే రోజులు పోయాయని, కేంద్రం చెప్పే మాయమాటలు ఎవరూ నమ్మరని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో రైతన్న సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కష్టం, శ్రమను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారన్నారు. నల్లచట్టాలతో ఎంత నష్టం వాటిల్లుతుందో అర్థమయ్యే లా చిత్రీకరించారన్నారు. విద్యుత్ వినియోగానికి మోటర్లు బి గించుకోవాలనడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే ఆ యా పార్టీల నేతలకు పదవులు వచ్చిన సంగతి మర్చిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతుబంధు, బీమా తదితర పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. రైతుల ను ఇబ్బందులకు గురి చేసిన పార్టీలకు కాలం చెల్లుతుందన్నా రు. తక్కువ సమయంలోనే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు రవికిషన్రెడ్డి, అనంతరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, భాస్కర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
నారాయణమూర్తికి సన్మానం..
మహబూబ్నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తిని మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. మున్ముందు రైతులకు మరింత మేలు జరిగేలా సినిమాలు తీయాలని కోరారు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ సినిమాలు చిత్రీకరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, నారాయణపేట కలెక్టర్లు వెంకట్రావు, హరిచందన, అధికారులు ఉన్నారు.