పాలమూరు, ఏప్రిల్ 30 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాలమూరులోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మన్హబింద్ మహమ్మద్, సయ్యద్ మిస్బాఉద్దీన్, అనిమిత్ ప్రీతం, మెతు కు శైలజ, అందె రోహిత్, ముసలి సాయికాంత్రెడ్డి, కే.శ్రీనాథ్రెడ్డి, ఆర్.పల్లవిక, ఫాతిమా ఖదీర్, ఎం. నక్షత్ర, జీ.సాయిశ్రీరెడ్డి, వీ.నందిని, బీ.వెష్ణవి 10 జీపీఏ సాధించారు. తొమ్మిది మంది 9.8జీపీఏ, ఐదుగురు 9.7జీపీఏ, ఐదుగురు 9.5జీపీఏ, ఆరుగురు 9.3 జీపీఏ సాధించారు. అదేవిధంగా ఎనిమిది మంది 9.2 జీపీఏ, ఆరుగురు 9.0జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ డా.మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపాల్ మమత, వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, ఉపాధ్యాయులు అభినందించారు.