హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం హైదరాబాద్తోపాటు 19 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు వీచాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37.3, వికారాబాద్ జిల్లా ధరూర్లో 36, మియాపూర్లో 32.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.