న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇవాళ భారీ ర్యాలీ తీశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ఆయన ర్యాలీతో వెళ్లారు. వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈడీ తీరును ఖండిస్తూ సెంట్రల్ ఢిల్లీలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. రాహుల్తో పాటు ర్యాలీలో ప్రియాంకా గాంధీ, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు ఈ ర్యాలీ జరిగింది. రాహుల్కు పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా.. ఆయన ర్యాలీ తీశారు. అనేక మంది కాంగ్రెస్ నేతల్ని వేరువేరు చోట్ల అరెస్టు చేశారు. ఈడీ ఆఫీసు నుంచి ప్రియాంకా వెళ్లిపోయారు.