విదేశీ ఆటగాళ్ల కోసం వెంపర్లాడే ఫ్రాంచైజీలు ఈ సారి వ్యూహం మార్చి దేశీయ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. అందులోనూ కుర్రాళ్లకు పెద్దపీట వేస్తూ.. కనకాభిషేకం చేశాయి. తొలి రోజు కిషన్, దీపక్, శ్రేయస్ కండ్లు చెదిరే ధరకు అమ్ముడుపోతే.. రెండో రోజు లివింగ్స్టోన్ కోసం పంజాబ్ పదకొండున్నర కోట్లు వెచ్చించింది.
దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ తిలక్ వర్మను రూ. 1.70 కోట్లకు ముంబై
చేజిక్కించుకుంటే.. మిలింద్ను పాతిక లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది. మొత్తంగా పది ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు వెచ్చించగా.. సరికొత్త రూపు సంతరించుకున్న జట్లు మైదానంలో సందడి చేయనున్నాయి.
బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు ఆద్యంతం ఆసక్తి రేపిన వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలతో ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని జట్లు బలమైన కోర్ గ్రూప్ను ఎంపిక చేసుకున్నాయి. తొలి రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లపై పెద్దగా ఖర్చు చేయని ఫ్రాంచైజీలు రెండో రోజు వారికోసం భారీ మొత్తాన్ని వెచ్చించాయి. టీ20 స్పెషలిస్ట్ లియామ్ లివింగ్స్టోన్ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసుకుంటే.. జోఫ్రా ఆర్చర్ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కైవసం చేసుకుంది. 2022 సీజన్కు ఆర్చర్ అందుబాటులో ఉండకున్నా.. ముంబై అతడి కోసం అంత మొత్తాన్ని వెచ్చించడం గమనార్హం. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణకు భారీ ధర ముట్టజెప్పిన ఫ్రాంచైజీలు.. స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ జోలికి పోలేదు. వెస్టిండీస్ ఆల్రౌండర్ ఓడెన్ స్మిత్ కోసం పంజాబ్ ఆరు కోట్లు ఖర్చు పెట్టగా.. రొమారియో షెఫర్డ్ కోసం సన్రైజర్స్ రూ. 7.75 కోట్లు వెచ్చించి ఆశ్చర్యపరిచింది. తొలి రోజు వేలంలో రబడను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు యువ పేసర్ ఖలీల్ అహ్మద్(రూ. 5.25 కోట్లు), చేతన్ సకారియా (రూ. 4.20 కోట్లు)ను జట్టులోకి తీసుకుంది. ముంబై, చెన్నై జట్లు దాదాపు పాత ప్లేయర్లనే తిరిగి చేజిక్కించుకోగా.. లీగ్లోకి కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈసారి వేలంతో బాగా లబ్ది పొందితే.. అనూహ్య నిర్ణయాలతో సన్రైజర్స్ ఆశ్చర్యపరిచింది.
అర్జున్ టెండూల్కర్ మళ్లీ ముంబైకే..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ను మరోసారి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసుకుంది. గత వేలంలో 20 లక్షలకు దక్కించుకున్న అర్జున్ కోసం ఈ సారి ముంబై రూ. 30 లక్షలు వెచ్చించింది.
యువ ఆటగాళ్ల జోరు..
2022 అండర్-19 ప్రపంచకప్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ రాజ్ బవా కోసం పంజాబ్ రెండు కోట్లు ఖర్చు చేయగా.. రాజవర్ధన్ను చెన్నై రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. యష్ ధుల్ కోసం ఢిల్లీ రూ. 50 లక్షలు వెచ్చించింది.
రైనా కథ ముగిసే..
ఐపీఎల్లో ఆటగాడిగా సురేశ్ రైనా ప్రస్థానం ముగిసింది. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ‘చిన్న తలా’ వచ్చే సీజన్లో ఏ జట్టు తరఫున ఆడటం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రైనా.. ఐపీఎల్కూ దూరమయ్యాడు. రాయుడు, రాబిన్ ఊతప్ప, బ్రావో వంటి వెటరన్లను వేలంలో తిరిగి కొనుగోలు చేసుకున్న చెన్నై.. రైనా వైపు కన్నెత్తి చూడకపోగా.. ఇతర జట్లుకూడా కొనుగోలు చేసుకోలేదు.
రాజస్థాన్ – 24 మంది
సంజూ శాంసన్, రియాన్ పరాగ్, తేజ బరోక, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, అనునయ్ సింగ్, కుల్దీప్ పేన్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, శుభం గర్వాల్, కౌల్టర్ నైల్, అశ్విన్, బౌల్ట్, బట్లర్, డసెన్, నీషమ్, డారిల్ మిషెల్, కరుణ్ నాయర్, యుజ్వేంద్ర చాహల్, హెట్మైర్, నవ్దీప్ సైనీ, కేసీ కరియప్ప, మెకాయ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ముంబై – 25 మంది
రోహిత్ శర్మ, సంజయ్ యాదవ్, బ్రేవిస్, రమన్దీప్ సింగ్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ది, అర్శద్ ఖాన్, పోలార్డ్, ఉనాద్కట్, సూర్యకుమార్, తైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్, బుమ్రా, ఆర్చర్, ఫాబియన్ అలెన్, ఇషాన్ కిషన్, బాసిల్ థంపి, డానియల్ సమ్స్, అన్మోల్ప్రీత్ సింగ్, టిమ్ డేవిడ్, మెరెడిత్.
లక్నో – 21 మంది
కేఎల్ రాహుల్, మోహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్, మనీశ్ పాండే, షాబాజ్ నదీమ్, స్టొయినిస్, మయేర్స్, మార్క్ వుడ్, డికాక్, హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఎవిన్ లూయిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, మనన్ వోహ్రా, దుష్మంత చమీర, అంకిత్ రాజ్పుత్, అవేశ్ ఖాన్.
గుజరాత్ – 23 మంది
హార్దిక్ పాండ్యా, సాయి కిషోర్, శుభ్మన్ గిల్, దర్శన్, సాయి సుదర్శన్, యష్ దయాల్, నూర్ అహ్మద్, మాథ్యూ వేడ్, ప్రదీప్ సాంగ్వాన్, వృద్ధిమాన్ సాహా, జాసెన్ రాయ్, డేవిడ్ మిల్లర్, వరుణ్ అరోన్, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, లూకీ ఫెర్గూసన్, గుర్కీరత్ సింగ్ మన్, అల్జారీ జోసెఫ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, డామినిక్ డ్రాక్స్
జట్ల స్వరూపమిలా..
బెంగళూరు – 22 మంది
కోహ్లీ, ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, లువ్నిత్ సిసోడియా, షాబాజ్ అహ్మద్, ఆకాశ్దీప్, అనీశ్వర్ గౌతమ్, బెరెన్డార్ఫ్, హజిల్వుడ్, దినేశ్ కార్తీక్, కరణ్ శర్మ, డేవిడ్ విల్లే, మ్యాక్స్వెల్, సిద్ధార్థ్ కౌల్, హర్షల్ పటేల్, డుప్లెసిస్, చామ మిలింద్, వణిండు హసరంగ, మహిపాల్ లోమ్రర్, రూథర్ఫోర్డ్, మహమ్మద్ సిరాజ్, అలెన్.
కోల్కతా- 25 మంది
శ్రేయస్ అయ్యర్, అనుకూల్ రాయ్, శివమ్ మావి, అభిజీత్ తోమర్, ప్రథమ్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రసిఖ్ సలామ్, అమన్ ఖాన్, రమేశ్ కుమార్, అశోక్ శర్మ, నరైన్, సౌథీ, షెల్డన్ జాక్సన్, అలెక్స్ హేల్స్, మహమ్మద్ నబీ, రస్సెల్, రహానే, సామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, బాబా ఇంద్రజిత్, పాట్ కమిన్స్, నితీశ్ రాణా, చమిక కరుణరత్నె, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్.
పంజాబ్ – 25 మంది
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధవన్, రాహుల్ చాహర్, అథర్వ తైడే, అర్శ్దీప్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, వైభవ్ అరోరా, అన్ష్ పటేల్, రాజ్ బవా, బెన్నీ హోవెల్, రిషి ధవన్, బెయిర్స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టోన్, సందీప్ శర్మ, బల్తేజ్ సింగ్, కగిసో రబడ, వృత్తిక్ చటర్జీ, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ, ఓడెన్ స్మిత్, నాథన్ ఎలీస్, ప్రేరక్ మన్కడ్, ఇషాన్ పొరెల్.
చెన్నై – 25 మంది
ధోనీ, జడేజా, జగదీశన్, హరి నిశాంత్, సుభాన్షు సేనాపతి, రుతురాజ్ గైక్వాడ్, ఆసిఫ్, ముఖేశ్ చౌదరీ, మహేశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, రాజ్వర్ధన్, భగత్ వర్మ, ప్రశాంత్ సొలంకి, జోర్డాన్, ప్రెటోరియస్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, కాన్వే, దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే, శాంట్నర్, బ్రావో, శివమ్ దూబే, తుషార్ దేశ్పాండే, మోయిన్ అలీ.
ఢిల్లీ – 24 మంది
రిషబ్ పంత్, పృథ్వీ షా, నాగర్కోటి, చేతన్ సకారియా, రిపాల్ పటేల్, యష్ ధుల్, విక్కీ ఓస్తాల్, వార్నర్, మిషెల్ మార్ష్, ముస్తఫిజుర్, మన్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నోర్జే, కేఎస్ భరత్, ఎంగ్డీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టిమ్ సైఫెర్ట్, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, అశ్విన్ హెబ్బర్, రావ్మన్ పావెల్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ప్లేయర్లు ఆకట్టుకున్నారు. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న యువ క్రికెటర్లు ఠాకూర్ తిలక్వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ది, భగత్వర్మ.. ఫ్రాంచైజీల పోటీలో నిలిచారు. ముఖ్యంగా తన దూకుడైన బ్యాటింగ్తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్తో రాణిస్తున్న 19 ఏండ్ల ఠాకూర్ తిలక్వర్మను డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లకు సొంతం చేసుకుంది. దీనిపై వర్మ స్పందిస్తూ ‘లీగ్లో ముంబై ఇండియన్స్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకెంతో ఇష్టమైన జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడంతో నా కల నెరవేరబోతున్నది. వేలంలో అమ్ముడుపోతానని ముందే అనుకున్నాను. కానీ ఇంత భారీ ధరకు తీసుకుంటారనుకోలేదు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటను చూస్తూ పెరిగిన నేను అతన్ని కలుసుకునే అవకాశం లభించింది. కెప్టెన్ రోహిత్శర్మ నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. మరోవైపు సయ్యద్ ముస్తాక్ టోర్నీ(2021-22)లో అత్యధిక వికెట్ల(18)తో రాణించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తనయుడు లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రూ.25 లక్షలకు కైవసం చేసుకుంది. చురుకైన వేగానికి స్వింగ్ను జోడిస్తూ బంతులు సంధించే మిలింద్..నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ‘వేలంలో ఆర్సీబీ నన్ను ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉంది. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది. కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్తో కలిసి ఆడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని అన్నాడు. రాహుల్ బుద్ది(ముంబై, 20 లక్షలు), భగత్వర్మ(చెన్నై, 20 లక్షలు)ను లీగ్లో వేర్వేరు జట్లు కొనుగోలు చేశాయి.
టాప్-5 ప్లేయర్లు