కామారెడ్డి టౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకవెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్నూర్ నియోజకవర్గంలో 9 పత్తి మిల్లులు ఉన్నాయని తెలిపారు.వ్యవసాయ అధికారుల వద్ద అనుమతి పత్రాలు పొంది పత్తిని మిల్లులకు తరలించాలని రైతులకు సూచించారు.
కామారెడ్డి ప్రాంత రైతులు సిరిసిల్ల మిల్లుకు పత్తిని తరలించే విధంగా ఉన్నతాధికారులతో చర్చిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతు ధర గోడ ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య పాల్గొన్నారు.