అమృత్సర్: పంజాబ్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. పాక్వైపు నుంచి వచ్చిన డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. సోమవారం తెల్లవారుజామున పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని (Ferozpur sector) అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ దళాలు డ్రోన్ను గుర్తించాయి. దీంతో జవాన్లు దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. డ్రోన్ నుంచి ఐదు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు.
గత నెల 9న గురుదాస్పూర్ సెక్టార్లోని పంజ్గ్రైన్ వద్ద బీఎస్ఎఫ్ దళాలు డ్రోన్ను కూల్చివేశారు. పాక్ నుంచి వచ్చిన ఆ డ్రోన్ 4.7 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని జారవిడిచింది. అనంతరం పాక్వైపు వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. వాటితోపాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.