భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. థాయ్ల్యాండ్కు చెందిన పాన్పావీ చోచువాంగ్పై విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. రౌండ్-3 మ్యాచ్లో వీళ్లిద్దరూ తలపడ్డారు.
ఈ మ్యాచ్లో 21-14, 21-18తో వరుస సెట్లలో గెలిచిన సింధు.. చోచువాంగ్ను మట్టికరిపించింది. మొత్తం 48 నిమిషాలపాటు ఈ మ్యాచ్ జరిగింది. ఇంతకుముందు వీళ్లిద్దరూ ఆడిన చివరి రెండు మ్యాచుల్లోనూ సింధు ఓటమిపాలైంది.క్వార్టర్స్లో టైజు యింగ్తో సింధు తలపడనుంది.