వరుసగా రెండేండ్ల పాటు ప్రపంచ చాంపియన్గా కొనసాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో అడుగు పెట్టనుంది. 2019లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన మెగాటోర్నీలో టైటిల్ పట్టిన తెలుగమ్మాయి.. స్పెయిన్లోనూ సత్తాచాటాలని భావిస్తుంటే.. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేక పోతున్న కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ తమ రాత మార్చుకోవాలని చూస్తున్నారు. మొమోటా, మారిన్, ఒకుహరా వంటి స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ప్రపంచ విజేతలుగా నిలిచేదెవరో నేటి నుంచి తేలనుంది!
హుయెల్వా (స్పెయిన్): రెండేండ్లుగా ప్రపంచ చాంపియన్ హోదాలో ఉన్న భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు.. ఆ టైటిల్ నిలబెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నది. కరోనా విజృంభణ కారణంగా గతేడాది బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్ రద్దు కాగా.. ఈ ఏడాది స్పెయిన్ వేదికగా ఆదివారం నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ భయాలతో పాటు.. గాయాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు టోర్నీకి దూరం కాగా.. వరల్డ్ టూర్ ఫైనల్స్లో రజత పతకం కైవసం చేసుకున్న సింధు.. ఇదే జోరులో రెండోసారి ప్రపంచ చాంపియన్గా నిలువాలని చూస్తున్నది. పురుషుల విభాగంలో రెండుసార్లు విజేత కెంటా మొమోటా (జపాన్), మహిళల విభాగంలో మూడు సార్లు చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), 2017 ఎడిషన్ విజేత నజోమీ ఒకుహరా (జపాన్) పోటీ నుంచి తప్పుకోగా.. కెరీర్లో ఒక్కసారి కూడా ఈ టోర్నీని మిస్ చేయని భారత మరో స్టార్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. దీంతో ఆరో సీడ్ సింధు టైటిల్ నిలబెట్టుకోవడం సులభమే అనిపిస్తున్నా.. టాప్ సీడ్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ), అన్ సెయాంగ్ (దక్షిణ కొరియా), పోన్పవీ చొచువాంగ్ (థాయ్లాండ్) వంటి వారితో తెలుగమ్మాయికి గట్టి పోటీ ఎదురుకానుంది.
అడ్డంకులు దాటితేనే..
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధుకు ‘బై’ లభించగా.. రెండో రౌండ్లో మార్టినా రెప్సిక (స్లొవేకియా)తో తలపడనున్నది. తదుపరి రౌండ్లో చొచువాంగ్ రూపంలో సింధుకు గట్టి ప్రత్యర్థి ఎదురుకానుంది. గత రెండు పర్యాయాలు థాయ్లాండ్ చిన్నదాని చేతిలో ఓడిన తెలుగమ్మాయి.. ఈసారి బదులు తీర్చుకుంటే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ తై జూ యింగ్తో తలపడాల్సి రావొచ్చు. గత నాలుగు మ్యాచ్ల్లో సింధుపై విజయాలు సాధించిన తై జూ.. ఓవరాల్ ముఖాముఖిలోనూ 14-5తో ముందంజలో ఉండటం భారత అభిమానులను కలవర పెడుతున్నది. అయితే టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం చేజిక్కించుకున్నాక ఆట నుంచి బ్రేక్ తీసుకొని తిరిగి కోర్టులో అడుగుపెట్టిన సింధు.. పూర్తిస్థాయిలో సత్తాచాటితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇటీవల జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్లో చక్కటి ప్రదర్శనతో తుదిపోరుకు చేరిన సింధు.. ఫైనల్లో దక్షిణ కొరియా టీనేజ్ సంచలనం అన్ సెయాంగ్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ పరాజయాన్ని పక్కన పెట్టి మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సింధు విజయం సాధించాలని ఆశిద్దాం!
శ్రీకాంత్పైనే ఆశలు..
పురుషుల సింగిల్స్లో టాప్సీడ్ కెంటా మొమోటా తప్పుకోవడంతో కాస్త ఆసక్తి తగ్గిన ఈ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 12వ సీడ్గా బరిలోకి దిగనున్నాడు. మొదటి రౌండ్లో పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. శ్రీకాంత్తో పాటు సింగిల్స్లో సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, యువ షట్లర్ లక్ష్యసేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్లో టాప్ -2 జోడీలు టోర్నీ నుంచి తప్పుకోగా.. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగుతున్నది. భారత ద్వయానికి తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్తోనే మెగాటోర్నీని ఆరంభించనుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో లి జియాన్-జియా యూ థింగ్ (చైనా) ద్వయంతో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట తలపడనుంది.
అబుదాబి చాంప్ జెహాన్
అబుదాబి: భారత యువ రేసర్ జెహాన్ దారువాలా జోరు కొనసాగుతున్నది. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన అబుదాబి ఫార్ములా-2 గ్రాండ్ప్రిలో జెహాన్ టైటిల్ విజేతగా నిలిచాడు. పదో స్థానంతో ప్రధాన రేసును మొదలుపెట్టిన జెహాన్ ఈ సీజన్లో రెండో టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 23 ల్యాప్ల రేసు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో రేసును జెహాన్ తొలి స్థానంతో ముగించగా, ఫెలిపె డ్రుగోవిచ్(బ్రెజిల్), అస్కార్ పియాస్ట్రి(ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. రెండు సెకన్ల తేడాతో ఈ యువ ముంబై రేసర్ అబుదాబి టైటిల్ను ఎగరేసుకుపోయాడు. గతేడాది బహ్రెయిన్లో గెలిచిన జెహాన్…మొంజాలో విజయకేతనం ఎగురవేశాడు.
3 ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో నాలుగు వందల వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా లియాన్ నిలిచాడు. షేన్ వార్న్ (708), మెక్గ్రాత్ (563) ముందున్నారు.
4 ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ అరంగేట్ర టెస్టులోనే ఎనిమిది క్యాచ్లు పట్టి ఆకట్టుకున్నాడు.