పారిస్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో గురువారం ప్రపంచ చాంపియన్ సింధు 21-14, 21-14తో ఎనిమిదో సీడ్ బుసానన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్లలో విజయం సాధించింది. నేడు జరుగనున్న సెమీస్లో జపాన్కు చెందిన సయాకా తకహాషితో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో భారత ఆటగాడు లక్ష్యసేన్ 17-21, 15-21తో క్వాంఘీ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలవగా.. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ పరాజయం చెందింది.