చండీగఢ్, అంబాల, ఏప్రిల్ 17: హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లో అన్నదాతలు ఆందోళనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం పాటియాల జిల్లాలో పంజాబ్, హర్యానా సరిహద్దు సమీపంలో అంబాల-లుథియానా మార్గంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసనకు దిగారు. వీరి ఆందోళన కారణంగా సుమారు 30 రైళ్ల దారి మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. శ్రీరామనవమి రోజు రైతులు ఆందోళనకు దిగడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.