తిరుమల : రేపటి నుంచి 19వ తేదీ వరకు ఏకాంతంగా పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 11న ధ్వజారోహణం పెద్దశేషవా హనం, 12న చిన్నశేషవాహనం,13న సింహ వాహనం, 14న కల్పవృక్ష వాహనం, 15 న మోహినీ ఉత్సవం, 16న సూర్యప్రభ వాహనం , 17న కల్యాణోత్సవం, 18న రథోత్సవం, 19న వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 59,086 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,701 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.