డార్బీ: భారత సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు) కౌంటీ చాంపియన్షిప్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ససెక్స్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న పుజారా.. తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులకే ఔటైనా.. రెండో ఇన్నింగ్స్లో విజృంభించాడు. మొదట బ్యాటింగ్ చేసిన డార్బీషైర్ 505/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 174 రన్స్కు ఆలౌటైంది. ఫాలో ఆన్లో పుజారాతో పాటు టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) దంచి కొట్టడంతో ససెక్స్ రెండో ఇన్నింగ్స్లో 513/3తో నిలువడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.