అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీ ( YCP MLC ),శాసన మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ఏపీలో కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామలింగాపురంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమం వదిలేసి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుందని, చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పట్టిందని విమర్శించారు.
నిత్యవసర ధరలు ఆకాశాన్ని ఎగబాకినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. ఓటు వేసిన పాపానికి రోజుకి 10 సార్లు పవర్ కట్ అవుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాలు దుర్భరంగా కాలం వెల్లదీస్తున్నారని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరీక్షలు జరగకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీలో కూటమి పాలనకే ఆ చరిత్ర దక్కిందని విమర్శించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని మరోసారి స్పష్టం చేశారు. మెరిట్ లిస్టు జిల్లాల వారీగా ప్రకటించలేదని అసెంబ్లీలో చర్చకు పట్టుపడితే సమాధానం లేదని ఆరోపించారు.