సీఎం కేసీఆర్ సదుద్దేశంతో దళితబంధు పథకం తీసుకొచ్చిండు..దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసిండు. దళితుల బతుకులు మార్చి అభివృద్ధి బాటపట్టించేందుకే ఈ పథకం పెట్టిండు. పారద్శకంగా అమలుచేస్తున్నడు. ఇది ఓర్వలేకనే ప్రతిపక్షాలు మా దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దళితబంధు పైసలు రావని, వెనక్కి పోతున్నయంటూ ఆగం జేస్తున్నరు. కానీ సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని వందకువందశాతం సక్సెస్ చేస్తడని మాకు నమ్మకం ఉన్నది. ఆయన ఏ పథకం పెట్టినా సక్సెస్ అయింది.. ఇప్పటిదాకా వెనుకడుగు వేయనేలేదు. దళితబంధు కూడా వందశాతం సక్సెస్ అయితదని నేనే కాదు.. మా కాలనీవాసులు కూడా నమ్ముతున్నరు. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం..
ఏ రవీందర్, దళిత నాయకుడు, మామిడాలపల్లి (వీణవంక)