నాగర్కర్నూల్, మార్చి 16 : రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన రోడ్లకు సంబంధించి న ప్రతిపాదనలు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టానికి మంజూరు చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రసంగించారు. దేశ ప్రగతికి మూలమైన రహదారులను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 130 కోట్ల జనాభా గల దేశంలో 90 శాతం ప్రజలు రోడ్డు సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందన్నారు. మహబూబ్నగర్-నాగర్కర్నూల్-మన్ననూర్ స్టేట్ హైవేను, కొత్తకోట, ఆత్మకూరు, మంత్రాలయం హైవే, జడ్చర్ల-బిజినేపల్లి-వనపర్తి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు.కల్వకుర్తి-తాడూరు-కొల్లాపూర్-సోమశిల-నంద్యాల జాతీయ రహదారికి రూ.1200 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.