హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ పూర్తయింది. 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు నుంచి సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. 33 మందికి సహాయ కార్యదర్శులుగా, 20 మందికి ఉప కార్యదర్శులుగా 8 మందికి సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. అలాగే నలుగురు జాయింట్ సెక్రెటరీలు.. అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతి పొందారు. ఇవాళ ఉద్యోగుల పదోన్నతికి సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. న్యాయపరమైన అంశాల వివాదాల్లో లేని 120 మందికి పదోన్నతులు కల్పించారు.