తిరుమలాయపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి తమ సంఘం ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు. తిమ్మిడా హనుమంతరావు పాల్గొన్నారు.